ఛత్తీస్గఢ్ : వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణంలో పాలుపంచుకున్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగులబెట్టారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. 2 కాంక్రీట్ మిక్సర్లు, 2 పొక్లెయినర్లు, ఓ ట్రాక్టర్ను మావోయిస్టులు దహనం చేశారు.