ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్ అన్హ్యూసర్ బుష్ ఇన్బెవ్ (ఏబీ ఇన్బెవ్) తమ మొట్టమొదటి వాటర్ హెల్త్ కేంద్రం (డబ్ల్యుహెచ్సీ)ను సంగారెడ్డిలో జలధార ఫౌండేషన్ ,వాటర్హెల్త్ ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంగారెడ్డి మున్సిపాలిటీ ఛైర్మన్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ బీ చంద్రశేఖర్, సంగారెడ్డి మున్సిపాలిటీ మేనేజర్ అలీ బేగ్ పాల్గొన్నారు.
నీటి నిర్వహణపై 2025 ప్రపంచ సుస్ధిరత లక్ష్యాలను చేరుకోవడానికి కంపెనీ ప్రయత్నాలను ఈ ఆవిష్కరణ బలపరుస్తుంది. గ్రామీణ, పట్టణ, నగరాలలోని నిరుపేదలకు సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో జలధార ఫౌండేషన్, వాటర్ హెల్త్ ఇండియాతో ఏబీ ఇన్బెవ్ ప్రస్తుత భాగస్వామ్యాన్ని ఇది బలోపేతం చేయనున్నది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీ ఛైర్మన్ విజయలక్ష్మి, ఛైర్మన్ మాట్లాడుతూ ‘‘సంగారెడ్డిలో సురక్షిత తాగునీటిని అందించాలనే మా ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తున్న ఏబీ ఇన్బెవ్, జలధార ఫౌండేషన్ , వాటర్హెల్త్ ఇండియాలను అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన మద్దతు మేము అందిస్తాం’’ అని అన్నారు.