బచ్చన్నపేట, ఏప్రిల్8: కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో దాన్ని కట్టడి చేసే బాధ్యత అందరిపై ఉందని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఎస్సై జలగం లక్ష్మణ్రావు, మండల వైద్యాధికారి కర్రె నవీన్కుమార్, తహసీల్దార్ విమల, ఎంపీడీవో రఘురామకృష్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ప్రజలకు కరోనా నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రెండో దశ ప్రమాదకరమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 45 ఏండ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల పోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్రెడ్డి, బచ్చన్నపేట సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి భీమ్రాజు, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
కరోనాపై అప్రమత్తంగా ఉండండి
దేవరుప్పుల: కడవెండిలో గురువారం ఉపాధిహామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో పోలీసుశాఖ కళాబృందం కరోనాపై అవగాహన కల్పించింది. కళాకారుడు చందు మాట్లాడుతూ కరోనా వైరస్ను కట్టడి చేయాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 45 ఏళ్లు నిండిన వారు వ్యాక్సిన్ చేయించుకోవాలని అన్నారు. సర్పంచ్ బెత్లినారెడ్డి, ఉపసర్పంచ్ నాగేశ్, రైతు బంధు గ్రామకోఆర్డినేటర్ లీనారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామపోలీసు అధికారి రమేశ్ పాల్గొన్నారు.
కరోనా నివారణపై అవగాహన
చిలుపూర్: లింగపల్లి గ్రామంలో బుధవారం రాత్రి వరంగల్ పోలీస్ కమిషనర్ అదేశానుసారం పోలీస్ జాగృతి కళా బృదం సభ్యులు కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాల నివారణ, డయల్100, గంజాయి, గుట్కా, ఈవ్టీజింగ్, మూఢనమ్మకాలు, సీసీ కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలపై పాటలు, నాటికల ద్వారా అవగాహన కల్పించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. సర్పంచ్ రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్కు ప్రత్యేక సైనిక సామాగ్రి ఇస్తాం : రష్యా
దివాళా అంచున కాఫీడే.. ఎందుకంటే..!