చిక్కడపల్లి : పార్టీ డివిజన్ కమిటీల్లో వివిధ పదవులు పొందిన వారిపై మరింత బాధ్యత పెరిగిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షునిగా ఎన్నికైన కల్యాణ్ నాయక్ ఆదివారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ను కలిసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల కోసం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తల పై ఉందన్నారు.
కల్యాణ్ నాయక్ మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తనకు పదవిని ఇచ్చినందుకు ఎమ్మెల్యే ముఠా గోపాల్, యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహకు, డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
ఈకార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, తెలంగాణ హౌజ్ ఫేడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, నాగభూషణం, రమేశ్ రెడ్డి, బాలు,కిషన్,రవి,చందు, తదితరులు పాల్గొన్నారు.