మైలార్దేవ్పల్లి : విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడలో నివసించే ఆటోడ్రైవర్ రాజు కుమారుడు జి శ్రీశాంత్ ఫుణేలో నిర్వహించిన వాకో ఇండియా నేషనల్ లెవల్ అండర్ 12 కిక్ బాక్సింగ్ పోటీలలో మెడల్ సాధించాడు.
సోమవారం వారు ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా విజయానికి కృషి చేసిన కోచ్తోపాటు బాలుడిని ఎమ్మెల్యే అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ..చిన్నారులు చదువుతో పాటు తమకు నచ్చిన క్రీడను ఎంచుకొని అందులో రాణించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహాకాలను అందజేస్తుందని తెలిపారు.. మైలార్దేవ్పల్లిలోని ఎన్ఎస్ఆర్ ఆకాడమీకి చెందిన కోచ్ మామిడ్ల సంతోష్ యాదవ్, రామంజనేయులు, పవన్ కుమార్ ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉన్నారు.