ముషీరాబాద్ : ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ శ్రేణులు పాటుపడాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం రాంనగర్ శాస్త్రినగర్లో ఏర్పాటు చేసిన డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్తీలు, కాలనీలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ పటిష్టత కోసం కలిసి కట్టుగా పని చేయాలని కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి అభివృద్ది పనులు చేస్తుంటే సంబంధం లేనివారు తామే చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, అటువంటి వారి ఆగడాలను సాగనివ్వకూడదన్నారు.
రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావులపాటి మోజస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, ఎరం శేఖర్, దామోదర్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ముదిగొండ మురళీ, కొండమడుగు మధు, నీలాదేవి, వివేక్, ముక్తార్ స్సేన్, అలందార్ స్సేన్, వాహిద్ స్సేన్, తులసీ, ఇజాజ్ తదితరులు పాల్గొన్నారు.