టేక్మాల్, సెప్టెంబర్ 24: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు. ఎలకుర్తిలో శుక్రవారం యాసంగి సాగు విధానంపై ఎలకుర్తి క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన కల్పించారు.యాసంగిలో పంట మార్పి డి చేసుకుని పప్పులు, చిరుధాన్యాలను పండించాలన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ శ్వేతచంద్రశేఖర్రెడ్డి, ఎంపీటీసీ మోహన్, పీఏసీఎస్ డైరెక్టర్ చందర్ ఉన్నారు.
ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలి
చిన్నశంకరంపేట,సెప్టెంబర్ 24: యాసంగిలో ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని రైతు బంధు మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి రైతులకు సూచించారు. మండల పరిధిలోని మడూరులో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవోలు రైతులు పాల్గొన్నారు.
కూరగాయల సాగుతో అధిక లాభాలు
మెదక్రూరల్ సెప్టెంబర్,24: రైతులు కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మెదక్ వ్యవసాయ సహాయ సంచాలకుడు నగేశ్ అన్నారు. మండల పరిధిలోని పాతూరులోని రైతు వేదికలో మెదక్ ఏడీ నగేశ్ , మండల వ్యవసాయఅధికారి లక్ష్మీప్రవీణ్ తో కలిసి యా సంగి పంటల సాగు, ప్రత్యామ్నాయ పంటలు ,కూరగాయల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవో రాజశేఖర్ , రాయిన్పల్లి సర్పంచ్ సిద్ధ్దాగౌడ్ , నాయకులు బాలయ్య, మోహన్ ఉన్నారు.
నిజాంపేటలో..
నిజాంపేట,సెప్టెంబర్24: ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల ఏవో సతీశ్ అన్నారు. ఆయన కల్వకుంటలోని రైతు వేదికలో యాసంగి సీజన్లో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన కల్పించారు.కార్యక్రమం లో నార్లపూర్ సర్పంచ్ అమరసేనారెడ్డి, ఏఈవో , రైతు బంధు సమితి గ్రామ కో_ఆర్డినేటర్ రాంచంద్రరెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్రెడ్డి, రైతులు ఉన్నారు.
చేగుంటలో..
చేగుంట ,సెప్టెంబర్24: యాసంగిలో వరికి బదులుగా నూనె గింజల పంటలు వేసుకోవాలని నార్సింగి ఎంపీపీ సబిత అన్నారు. నార్సింగిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొన్నారు. కార్యక్రమంలో నార్సింగి మండల వ్యవసాయశాఖ అధికారి యాదగిరి,రైతు బంధు మండల కోఆర్డినేటర్ లింగారెడ్డి, సొసైటీ చైర్మన్ శంకర్గౌడ్, ఎంపీటీసీ పాల్గొన్నారు.
చిలిపిచెడ్లో..
చిలిపిచెడ్,సెప్టెంబర్ 24: యాసంగిలో ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ఏడీఏ బాబునాయక్ అన్నారు. చిలిపిచెడ్ రైతు వేదికలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం ఏడీఏ మాట్లాడుతూ రైతులు యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు మినుము నూనెగింజలు, వేరుశనుగ, ఆముదం, చిరుధాన్యాలను పండించాలన్నారు.కార్యక్రమంలో ఏఈవో స్రవంతి,రైతు బంధు సమి తి జిల్లా సభ్యుడు సయ్యద్ హుస్సేన్, రైతు బంధు మండల అధ్యక్షుడు రాజిరెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ నగేశ్, ఎంపీటీసీ మల్లయ్య, మండల నాయకులు, రైతులు పాల్గొన్నారు
కొల్చారంలో..
కొల్చారం, సెప్టెంబర్ 24: యాసంగిలో రైతుల ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి బాల్రెడ్డి తెలిపారు. కొల్చారం క్లస్టర్ రైతు వేదికలో రైతులతో వ్యవసాయ సిబ్బంది సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరుతడి పంటలు సాగు చేయడం వ ల్ల రైతులకు లాభసాటిగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ కృష్ణ, ఏఈవోలు వినీతభవాని, అంబికా, ప్రతిభ, భార్గవ్ పాల్గొన్నారు.
నర్సాపూర్లో..
నర్సాపూర్,సెప్టెంబర్24: యాసంగి కాలానికి రైతులు ప్రత్యమ్నాయ పంటలపై మొగ్గు చూపాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం నత్నాయపల్లి సీనియర్ సైంటిస్ట్ శోభారాణి అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని రైతువేదికలో ఏ వో వెంకటేశ్ ఆధ్వర్యంలోప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భం గా సీనియర్ సైంటిస్ట్ శోభారాణి మాట్లాడుతూ యాసంగి కాలానికి పొద్దుతిరుగుడు, శనగ, కసుమ, వేరుశనగ వంటి పంటలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కేవీకే తునికి శాస్త్రవేత్త శ్రీకాంత్, ఏవో వెంకటేశ్ పాల్గొన్నారు.
తూప్రాన్/రామాయంపేటలో..
తూప్రాన్/రామాయంపేట, సెప్టెంబర్ 24: యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని రామాయంపేట వ్యవసాయ శాఖ డివిజన్ సహాయ సంచాలకులు వసంత సుగుణ అన్నారు. మండల పరిధిలోని కాట్రియా ల క్లస్టర్ పరిధిలోని కాట్రియాల రైతువేదికలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. మండలంలోని గుడ్రెడ్డిపల్లి క్లస్టర్ పరిధిలోని 11 గ్రామాల రైతులకు రైతువేదికలో మండల వ్యవసాయ శాఖ అధికారి నుస్రత్ పంటలపై పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమం లో రామాయంపేట ఏవోరాజ్నారాయణ, ఏఈవోలు సాయికృష్ణ, సింధు, రైతు బంధు మండల కోఆర్డినేటర్ సురేందర్రెడ్డి, రైతు బంధు గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
మనోహరాబాద్లో…
మనోహరాబాద్ సెప్టెంబర్ 24:మండలం కూచారంలో, శివ్వంపేట మండలం గోమారంలో నూతనంగా నిర్మించిన రైతువేదికలో రైతులకు ప్రత్యామ్మాయ పంటలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింహారెడ్డి, సర్పంచ్లు నరేందర్రెడ్డి, చంద్రకళ, బా నోత్ తుక్య, ఏవో స్రవంతి, ఏఈవోలు సచిన్, మజీద్అలీ, సుభాశ్, మౌనిక, రైతులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, సెప్టెంబర్ 24: యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారిణి మాలతి రైతులకు సూచించారు. ఆరుతడి పంటల సాగుపై బండపోసాన్పల్లి క్లస్టర్ పరిధిలోని రైతులు రైతువేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం హార్టికల్చర్ శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ కూరగాయలు, పండ్లు సాగు చేయాలని, ఎక్కువ లాభాలు తెచ్చే అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను సైతం సాగు చేయవచ్చని అన్నారు సమావేశంలో బండపోసాన్పల్లి క్లస్టర్ పరిధిలోని రైతులు అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.