నిజాంపేట, సెప్టెంబర్ 24 : సీజనల్ పం డ్లతో ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా వానకాలం చివర శీతాకాలం ప్రారంభంలో సీతాఫలం విరివిరిగా కనిపిస్తాయి. రుచికి తీపితోపాటు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉం టుంది. బీడు, సాగుభూముల్లో ఎక్కడ పడితే అక్కడ సీతాఫలం మొక్కలు పెరుగుతాయి. ఎక్కువగా గిరిజనులు పంట పొలాల వెంబడి తిరుగుతూ తట్టల్లో సీతాఫలాలను సేకరిస్తూ పెద్ద మొత్తంలో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇం టింటికీ తిరుగుతూ పండ్లను అమ్ముతున్నారు. దీంతో వారికి జీవనోపాధి కలుగుతున్నది.
జీవనోపాధిగా మారింది
ఉదయాన్నే లేచి చేతిలో తట్ట పట్టుకొని సీతాఫలం చెట్లను వెతుకుతూ పంట పొలాలు, బీడు భూముల్లో తిరుగుతూ పం డ్లను సేకరిస్తాం. ఒక్కోసారి చెట్లపై విషపాములు ఉంటాయి. జాగ్రత్తగా సేకరించిన పండ్లను వ్యాపారులకు అమ్మితే తట్టకు రూ.250 చొప్పున ఇస్తారు. శీతాకాలం మొత్తం మాకు ఇదే పని. సీతాఫలాలను అమ్మడం మాకు జీవనోపాధిగా మారింది.
బండారి రాములు, నిజాంపేట
వాడవాడ తిరుగుతూ అమ్ముతాను
ప్రతిరోజూ ఉదయం గ్రామంలోని అన్ని వాడలు తిరుగుతూ సీతాఫలాలను అమ్ముతాను. ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో పండ్లు ఉంటే వాటిలో కొన్నింటిని మంటల్లో కాల్చి అమ్ముతాను. నిజాంపేట బస్టాండ్ దగ్గర కూర్చొని అమ్మగా రోజుకు రూ.500 వస్తాయి. వచ్చిన డబ్బులను కుటుంబ పోషణకు ఖర్చు చేస్తాను.
గడిల లక్ష్మి, నిజాంపేట
సీతాఫలంలో ఔషధ గుణాలు