వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలి
దవాఖానల్లో కొవిడ్ పరీక్షల సంఖ్య పెంచాలి
రోగులకు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 6 : వ్యాక్సినేషన్ కొత్త ల క్ష్యం ప్రకారం జిల్లాలో ప్రతిరోజూ 2,500 మందికి కరో నా వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని కలెక్టర్ హరిచందన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య అధికారులతో మంగళవారం నిర్వహి ంచిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదేశించారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చే విధంగా లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతిరో జూ కొవిడ్ పరీక్ష సంఖ్యను పెంచాలని, అదేవిధంగా ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో అక్కడ ట్రేసింగ్ ప్రక్రియ ద్వారా కొవిడ్ సోకిన వారి వివరాలు సేకరించి, అతను ఎంత మందితో కలిసా రో వారి వివరాలు సేకరించి ముందుగానే వా రికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నా రు. స్వల్ప లక్షణాలతో ఉన్న వారికి చికిత్స, మందులు ఇచ్చి ఇంటికి పంపించి ఎప్పటికప్పు డు ఆరోగ్యం పరిరక్షిస్తుండాలన్నారు. జి ల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు పూ ర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాల్సిందిగా ఆయన ఆదేశించారు. ముఖ్యంగా బెడ్ల సంఖ్యను మరింత పెంచడం, ఆక్సిజన్, వెంటిలేటర్ అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
కరోనా కట్టడికి మాస్కులు ధరించడం తప్పనిసరిగా చే యాలని, ఎవరైనా ఉల్లంఘించినా వారికి జరిమానాలు వి ధించే విధంగా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రతి ఆశ కా ర్యకర్త 45 ఏండ్లు నిండిన 12 మందిని వ్యాక్సినేషన్కు తీ సుకు వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కొవిడ్ పరీక్షలను పెంచి సవరించిన లక్ష్యాల మేరకు జిల్లాలో ప్రతిరో జూ ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా దవాఖానల్లో కలిపి రోజుకు 945 ర్యాపిడ్ టెస్టులు, అవసరమైన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ దవాఖానలో కరోనా చికిత్స కో సం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్ట ర్ జయచంద్రమోహన్, జిల్లా దవాఖాన సూపరింటెండెం ట్ డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ శైలజ, డీఆర్డీఏ పీడీ కాళిందిని, సీఈవో సిద్రామప్ప పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో 24 గంటల్లో 55వేల కరోనా కేసులు
అస్సాంలో చివర విడుత 80 శాతానికిపైగా పోలింగ్