ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 55,469 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలోనే 297 మంది ప్రాణాలు కోల్పోయారు. 34,256 మంది కోలుకున్నారు.
ఒక్క ముంబై నగరంలోనే కొత్తగా 10,030 మందికి కొవిడ్-19 సోకింది. మరో 31 మంది కరోనా వల్ల చనిపోయారు. ఓవరాల్గా మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 31,13,354కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,72,283 యాక్టివ్ కేసులున్నాయి.