మున్సిపాలిటీలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం
కల్వకుర్తి, ఏప్రిల్ 11: పబ్లిక్ టాయిలెట్లను ఎప్పటికప్పు డు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ స త్యం పేర్కొన్నారు. ‘స్పచ్ఛతా సంకల్ప్ దేశ్కా, హర్ రవివార్ విశేష్ సా’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో చైర్మన్ మాట్లాడారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శివ, రమేశ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రంజాన్ ప ర్వదినాలు సమీపిస్తున్న క్రమంలో మున్సిపల్ చైర్మన్ ము న్సిపాలిటీలోని మసీదులను సందర్శించారు. పండుగ ఏ ర్పాట్లపై నిర్వాహకులను ఆరా తీశారు. కరోనా నేపథ్యం లో శానిటైజేషన్, బ్లీచింగ్ పిచికారీ చేయాలని, అలాగే వి ద్యుద్దీపాలను మసీదుల వద్ద ఏర్పాటు చేయాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ షాహెద్, కౌన్సిలర్లు బాలు, తాహెర్, ముక్రమ్, ఫరూక్, ఖాదర్, అబ్దుల్లా, మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
కల్వకుర్తి పట్టణం 13వ వార్డులో అనారోగ్యంతో మృతిచెందిన కిషోర్ కుటుంబాన్ని మున్సిపల్ చైర్మన్ పరామర్శించారు. మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట శ్రీధర్, కేశవదాస్, సాయి తదితరులు ఉన్నారు.