మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
మదనాపురం, ఏప్రిల్ 2 : సమీకృత మార్కెట్ యార్డులతో రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమీకృత మార్కెట్ యార్డు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ యార్డులను నిర్మించేందుకు రూ.500కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ మున్సిపాలిటీల్లో రెండు ఎకరాల స్థలాన్ని సేకరించి ఆగస్టు 15 నాటికి నిర్మించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమీకృత మార్కెట్ యార్డులో కూరగాయలు, మాంసాహార ఉత్పత్తులు, చేపలు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా విక్రయాలు జరుగుతాయన్నారు. ఈ మార్కెట్ల ద్వారా రైతులకు, ప్రజలు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు.
అమరచింత సమీపంలో కొత్తతండా హాస్టల్ వద్ద నిర్మిస్తున్న అర్బన్ పార్కు పనులను కొందరు గిరిజనులు అడ్డుకోవడం ఎందుకని కలెక్టర్ ప్రశ్నించారు. అభివృద్ధి పనులను ఎవరైనా అడ్డుకుంటే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. పోలీసు ప్రొటెక్షన్ ద్వారా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమరచింతలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డును ఇతర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభూషణంగౌడ్, తాసిల్దార్ సింధూజ, మున్సిపల్ కమిషనర్ రమేశ్ పాల్గొన్నారు.