చిక్కడపల్లి :గ్రంథాలయాలు విజ్ఞానానికి తరగని గనుల వంటివని, గ్రంథాలయాల అభవృద్ధికి తమవంతు కృషి చేస్తున్నామని నగర కేంద్రగ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రసన్నరామ్మూర్తి అన్నారు. గురువారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో పద్మశ్రీ ఎస్ఆర్ రంగనాథన్ జయంతిని పురస్కరించకుని గ్రంథపాలకుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రసన్న రామ్మూర్తి మాట్లాడుతూ నాటి నుంచి నేటితరం వరకు గ్రంథాలయాలు విజ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
గ్రంథాలయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో కూడా ప్రజలను విజ్ఞానవంతులుగా చేసేందుకు గ్రంథాయాలు కీలక పాత్ర పోషించాయని ఆమె వివరించారు.75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ఆజాది కీ అమృత్ మహోత్సవ్ పేరిట పుస్తక ప్రదర్శన నగర గ్రంథాలయంలో కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్ అయన లైబ్రేరియన్లను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి పద్మజా, గ్రేడ్ వన్ లైబ్రేరియన్ సుబ్బలక్ష్మి, గ్రంథాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ఆయోధ్య, టీఎన్జీవోస్ హైదరాబాద్ జిల్లా పూర్వ కార్యదర్శి దేవేందర్,లైబ్రరీ జేఏసీ బొల్లం మహేందర్,సుఖేష్ తదితరలు పాల్గొన్నారు.