నర్సంపేట, నర్సంపేట, ఏప్రిల్ 10: కరోనా వ్యాక్సిన్పై అపోహలు వద్దని నర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ అన్నారు. శనివారం దవాఖానలో టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. విధిగా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్పై ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
77 మందికి టీకాలు..
చెన్నారావుపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారని, ఎంపీవో సురేశ్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో కలిపి మొత్తం 77 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. వ్యాక్సిన్పై ప్రజలు భయం వీడాలని సూచించారు. ప్రజలు విధిగా మాస్కు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్నర్సు స్వరూపారాణి, సూపర్వైజర్లు రామెల్, లలిత, హెల్త్ అసిస్టెంట్ కుండె శివాజీ పాల్గొన్నారు.
అధికారులు, ఉద్యోగులకు వ్యాక్సిన్
నెక్కొండ: మండలకేంద్రంలోని పీహెచ్సీలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ సిబ్బందికి వైద్యాధికారి రమేశ్ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఎంపీడీవో సాహితీమిత్ర, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, నెక్కొండ సర్పంచ్ సొంటిరెడ్డి యమున, ఎంపీవో రవి, వార్డు సభ్యులు, కార్యదర్శులు, జీపీ సిబ్బంది ఉన్నారు.
50 మందికి వ్యాక్సినేషన్
శాయంపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించగా, రెండు రోజుల్లో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. శనివారం ఒక్కరోజే ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. శాయంపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. పత్తిపాక, గట్లకానిపర్తి, మైలారం, శాయంపేటకు చెందిన వారికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. శనివారం 50 మందికి వ్యాక్సిన్ వేసినట్లు హెల్త్ అసిస్టెంట్ చలపతి తెలిపారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
నర్సంపేట రూరల్: మండలంలోని 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని భాంజీపేట పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ కోరారు. భూపేశ్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్పై అపోహలు వీడాలి
ఆత్మకూరు: కరోనా వ్యాక్సిన్పై అపోహలు వీడాలని గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్నారు. అనంతరం వైద్యాధికారి రణధీర్ మాట్లాడుతూ కరోనా వైరస్పై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సాంబయ్య, సర్పంచ్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
కరోనా జాగ్రత్తలు పాటించాలి
దామెర: ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని ఎంపీపీ కాగితాల శంకర్ అన్నారు. దామెర పీహెచ్సీలో ప్రజాప్రతినిధులు, జీపీ సిబ్బందికి టీకాలు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, గండు రాము, దుబాసి శ్రీలత-రాధాకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ ఆరె వెంకట్రెడ్డి, శంకర్, కుమార్, డాక్టర్ కమల్చంద్నాయక్ పాల్గొన్నారు.
జీపీ సిబ్బందికి టీకాలు
గీసుగొండ: గ్రామ పంచాయతీ సిబ్బందికి మండలకేంద్రంలోని పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి మాధవీలత తెలిపారు. అర్హులందరూ సోమవారంలోగా టీకాలు వేసుకోవాలని ఆమె సూచించారు. కరోనా టీకా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో సీహెచ్వో మధుసూదన్, కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
మూడు రోజులు స్పెషల్ డ్రైవ్
పర్వతగిరి: మండలంలోని గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, జీపీ సిబ్బంది మూడు రోజులపాటు నిర్వహించే వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొని టీకాలు వేయించుకోవాలని ఎంపీడీవో చక్రాల సంతోష్కుమార్ కోరారు. శనివారం పలువురు జీపీ సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోగా, వివిధ కారణాల వల్ల టీకా తీసుకోని మరికొంత మంది వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ ముఖర్జీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
టీకాలు వేయించుకోవాలి
దుగ్గొండి: కరోనా కట్టడికి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని దుగ్గొండి పీహెచ్సీ వైద్యాధికారి కొమురయ్య సూచించారు. దవాఖానలో కరోనా టీకాపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మండలంలోని పారిశుధ్య కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. టీకాలు వేయించుకున్న వారు 30 నిమిషాలపాటు వైద్యుల పర్యవేక్షణ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
కోవిడ్ టీకాలు వృధా.. టాప్లో తమిళనాడు, హర్యానా
పట్వారిగూడెంలో వృద్ధ దంపతుల బలవన్మరణం