భద్రాద్రి కొత్తగూడెం : ఒంటరితనాన్ని భరించలేక ఓ వృద్ధ దంపతుల జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని దమ్మపేట మండలంలోని పట్వారిగూడెంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్వారిగూడేనికి చెందిన దూపకుంట్ల నాగ భూషణం(78), ఆదిలక్ష్మి (70) దంపతులకు నలుగురు కుమారులు. తల్లిదండ్రులు వారందరనీ పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. అందరికీ పెళ్లిళ్లు చేశారు.
వీరిలో ఒక కుమారుడు కొన్నేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. మిగిలిన వారిలో ఒకరు ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మిగిలిన ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో ఉంటూ పట్వారిగూడెంలో వ్యాపారం చేసుకుంటున్నారు.
వృద్ధ దంపతులు విడిగా ఓ ఇంట్లో నివసిస్తుండడంతో వారిని ఒంటరితనం కుంగదీసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రతి సొసైటీ లాభాల్లోకి రావాలి : మంత్రి ఎర్రబెల్లి
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతులకు న్యాయం చేస్తాం : ఎమ్మెల్యే గండ్ర
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
క్యూలో నిలుచున్న ఓటర్లను సీఆర్పీఎఫ్ చంపేసింది..