హైదరాబాద్: వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇండియా రికార్డు సృష్టించినా.. పలు రాష్ట్రాలు మాత్రం భారీ స్థాయిలో కోవిడ్ వ్యాక్సిన్ను వృధా చేస్తున్నాయి. కోవిడ్ టీకాలను వృధా చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు, హర్యానాలు టాప్లో నిలిచాయి. తమిళనాడులో 12.4 శాతం, హర్యానాలో 10 శాతం, బీహార్లో 8.1 శాతం వ్యాక్సిన్ వృధా అవుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అయిదు లక్షల డోసుల టీకాలను వృధా చేసినట్లు కేంద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇక టీకాలు వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఢిల్లీ(7), ఏపీ(7.3), పంజాబ్(8), అస్సాం(7.3), మణిపూర్(7.2)లు ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అద్భుత రికార్డును అందుకున్న రాష్ట్రాల్లో గోవా, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్, కేరళ, అండమాన్ నికోబార్, మీజోరం ఉన్నాయి. వ్యాక్సిన్లు వృధా కావడం ఆందోళన కలిగిస్తున్న నేషనల్ హెల్త్ అధారిటీ సీఈవో డాక్టర్ రామ్ సేవక్ శర్మ తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.