జగిత్యాల రూరల్, డిసెంబర్ 3 : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33 లక్షల 40వేల విలువైన చెకులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మేదరి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇందూరు గంగాధర్, కోశాధికారి శ్రావణ్కుమార్, గౌరవాధ్యక్షుడు చింత రమేశ్, కార్యవర్గ సభ్యులు కిషన్, వంశీ పాల్గొన్నారు.
జగిత్యాల నియోజక వర్గానికి చెందిన అంగన్ వాడీ టీచర్లు ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల్లో గ్రేడ్ -2సూపర్వైజర్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను శనివారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేయగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రేడ్ -2 సూపర్వైజర్లు శైలజ, నీలిమ, లావణ్య, భాగ్యలక్ష్మి, నిర్మల, షహనాజ్ పర్వీన్, రాధ, మంజుల పాల్గొన్నారు.