ముషీరాబాద్ : తెలుగు భాషా చైతన్య సమితి-లక్ష్య సాధన ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వైభవం కవితా సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవి.రమణాచారి ముఖ్య అతిధిగా పాల్గొని కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.
అనంతరం పలువురు ప్రముఖులకు తెలుగు భాషా చైతన్య సమితి వార్షికోత్సవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఎ.నరసింహారెడ్డి, తెలుగు భాషా చైతన్య సమితి ఫౌండర్ పి.బడేసాబ్, గానసభ అధ్యక్షుడు విఎస్.కళాజనార్థన మూర్తి, యుగంధర్గౌడ్, ప్రొఫెసర్ రాజారత్నం, నక్క శ్రీనివాస్ యాదవ్, నక్క శ్రీనివాసులు, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదరి ఎడ్ల కల్లేష్ పాల్గొన్నారు.