మణికొండ : ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఎ.లక్ష్మణ్, ప్రణీత రాజులకు సీఎం సహాయ నిధి ద్వారా ప్రభుత్వం మంజూరుచేసిన చెక్కులను మంగళవారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసంలో అందజేశారు.
మున్సిపల్ టీఆర్ఎస్ ప్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, కౌన్సిలర్ వసంత్ చౌహాన్, మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములులతో కలిసి ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ భాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందన్నారు.
అర్హులైన ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు జయరాజ్, ధన్రాజ్, కుమార్, శ్రీకాంత్, లక్ష్మణ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.