కందుకూరు : పల్లె ప్రగతిలో ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ పీడీ ప్రభాకర్ కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హలులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో ప్రభుత్వం గుర్తించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేయించాలని తెలిపారు.
ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించాలని సూచించారు. పల్లెలు పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. అనంతరం మాదాపూరు రెవెన్యూ పరిధిలో 5ఎకరాల్లో చేపట్టె మండల ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ఈజీఎస్ అధికారులకు పలు సూచనలను చేశారు. పల్లె ప్రకృతి వనంతో పాటు మండల ప్రకృతి వనంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీఓ క్రిష్ణకుమారి, హమ్మద్, ఎంపీఓ రవీందర్రెడ్డి, సీసీ రవికుమార్, సర్పంచ్ మంద సాయిలు, తదితరులు పాల్గొన్నారు.