షాబాద్, ఏప్రిల్ 8: రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు వంద మందికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతిరోజూ ఏడున్నర గం టలపాటు కోచింగ్, రూ.1,500 విలువగల పుస్తకాలు/స్టడీ మెటీరియల్ను ఉచితంగా ఇస్తారన్నారు. అంతేకాకుండా వారికి భోజనం కోసం ప్రతిరోజూ రూ.75 చెల్లిస్తారని తెలిపారు. ఇందుకోసం ఉత్సాహవంతులైన, ఆసక్తి కలిగిన రంగారెడ్డిజిల్లాలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీయువకులు ఈ నెల 9 నుంచి నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో www.tsstudy circle.co.in నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా షెడ్యూల్డ్ కులాల సంయుక్త సంచాలకుడు శ్రీధర్, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ గౌరవ డైరెక్టర్ను 90009 19109 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు.
వికారాబాద్, ఏప్రిల్ 8: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిఖిల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని అనంతపద్మనాభ కళాశాల (ఎస్ఏపీ)లో ఉచితంగా కోచింగ్తోపాటు మధ్యా హ్న భోజనం, అవసరమైన స్టడీ మెటీరియల్ను అందజేస్తారని తెలిపారు. ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో www.tsstudy circle.co.in దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 28నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని, పూర్తి వివరాలకు 95738 59268 నంబర్లో సంప్రదించాలన్నారు.
మహాత్మా ఫూలే జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఉదయం డీపీఆర్సీ భవనం మద్గుల్చిట్టంపల్లిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ నిఖిల తెలిపారు.
బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందేందుకు ఈనెల 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్ల ద్వారా తెలంగాణలో మొత్తం 1.25 లక్షల మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష 16న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్లో జరుగుతుందని, అభ్యర్థులు ఆన్లైన్లో https:/tsbcstudycircle.cgg.gov.in/FistPage.do రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఏ ఉద్యోగానికి కోచింగ్ ఇవ్వాలో నిర్ణయిస్తామన్నారు. అధిక మార్కులు సాధించిన వారిని గ్రూప్-1 శిక్షణకు ఎంపిక చేసి మెటీరియల్తోపాటు నెలకు రూ.5 వేల చొప్పున ఆరు నెలలపాటు ైస్టెపెండ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మిగిలిన వారికి మెరిట్ ఆధారంగా గ్రూప్-2, 3,4 ,కానిస్టేబుల్, ఎస్ఐ వంటి శిక్షణలకు ఎంపిక చేస్తామన్నారు. వీరికి మూడు నెలల శిక్షణలో నెలకు రూ.2 వేల చొప్పు న ఇవ్వడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీయువకుల కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల్లోపు ఉండాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ అందించే శిక్షణలో బీసీలకు 75శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్ 99083 06332 నంబర్ను సంప్రదించాలని సూచించారు.