మైలార్దేవ్పల్లి : పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని గణేష్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారి రామ్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు.
పాఠశాలలో ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి పోవడంతో తరగతి గదులు సరిపోవడం లేదని ఉపాద్యాయులు ఎమ్మెల్యే వివరించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..తరగతి గదుల కోసం ఎమ్మెల్యే నిధులను నుండి నాలుగు అదనపు గదులు నిర్మాణం చేపడుతానని హమీ ఇచ్చారు.
మంచి నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో నల్లా కనెక్షన్ ఇవ్వాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారిచేశారు. మధ్యాహ్న భోజనంలో మంచి ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ప్రధానోపాధ్యాయులను సూచించారు.
ఉపాధ్యాయుల బోధనలు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్ ,యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్,నాని,పాటశాల ఉపాద్యాయులు మాణిక్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.