బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు.
శుక్రవారం రాంగోపాల్పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే వెంగళ్రావు నగర్లో 2.5 లక్షల వ్యయంతో నూతనంగ చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను, రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంత్రి తలసాని బేగంపేట్, రాంగోపాల్పేట్ డివిజన్ల కార్పొరేటర్లు మహేశ్వరి, చీర సుచిత్రలతో కలిసి ప్రారంభించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల రహదారులను ప్రత్యేక కార్యచరణతో నిర్మాణ అభివృద్ధి పనులను చేపడుతున్నట్టు వివరించారు. రహదారులూలే కాకుండ మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల ఏర్పాటు, ఫుట్పాత్ల నిర్మాణం వంటి పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రజలు సమస్యలను దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా ఏవైన సమస్యలుంటే సంబంధిత అధికారులకు గానీ,తనకు కానీ తెలియజేయాలని కోరారు. అనంతరం స్థానికంగ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
చిన్నారులతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ సర్కిల్ ఉప కమిషనర్ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి,మాజీ కార్పొరేటర్ తరుణి, అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.