మహేశ్వరం: ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అమీర్పేట్ సర్పంచ్ బస్వశ్రీశైలంగౌడ్ అన్నారు.ఆదివారం గ్రామంలో స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రిన్స్ ఇస్రా హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఉపసర్పంచ్ పోతులనర్సింగ్పటేల్తో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మంచి పౌష్టికాహారం తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు.
ప్రస్తుతం కలుషితమైన ఆహారపదార్థాలతో ప్రజలు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని అన్నారు. మంచి విటమిన్ కలిగిన పదార్థాలను తిని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో కేజేప్రసాద్,రాజేందర్,శ్రీరాములు,కడార బాస్కర్,నర్సిహ్మ పాల్గొన్నారు.