అమీర్పేట్: సనత్నగర్ సుభాష్నగర్లో మొహర్రం పండుగను స్థానిక ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ నివాసితుల సంఘం ఆధ్వర్యంలో మొహర్రం పండుగను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ చేశారు. సుభాష్నగర్ కాలనీ నివాసితుల సంఘం ప్రధాన కార్యదర్శి మహ్మద్ సమీఉల్లా కులమతాలకు అతీతంగా అందరికీ షర్బత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం ప్రముఖులు మహ్మద్ ఆమేర్, మహ్మద్ రజాక్, మహ్మద్ దానేష్, మహ్మద్ యూసుఫ్, మహ్మద్ నసీర్, మహ్మద్ నిషాద్ తదితరులు పాల్గొన్నారు.