మణికొండ : పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని వట్టినాగులపల్లి, కోకాపేట గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంగళవారం మైలార్దేవ్పల్లిలోని ఆయన నివాసంలో స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.
వట్టినాగులపల్లి గ్రామానికి చెందిన డప్పు రాజు కుటుంబసభ్యులకు రూ.2,50000వేల చెక్కును స్థానిక నాయకుడు వేణుగోపాల్రెడ్డితో కలిసి అందజేశారు. అదేవిధంగా కోకాపేట గ్రామానికి చెందిన ముంగి శేఖర్రెడ్డి కుటుంబానికి రూ.3లక్షల చెక్కును స్థానిక కౌన్సిలర్ శివారెడ్డి, నాయకులు విశ్వనాథ్లతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వేలాది కుటుంబాలను సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, లబ్దిదారుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.