శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల పరిధిలో వెలసిన ఆక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కోరఢా ఝళిఫించారు. సోమవారం మండల పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్నగర్లోని గోపన్పల్లి ప్రభుత్వ సర్వేనెంబర్ 37లో ఇటీవల వెలసిన ఆక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన 8 గదులను ఈ సందర్భంగా నేలమట్టం చేశారు.
శేరిలింగంపల్లి మండల తాసీల్ధారు వంశీమోహాన్ అదేశాల మేరకు రెవెన్యూ అధికారులు చంద్రారెడ్డి, శ్రీనివాస్లు తమ సిబ్బందితో కలిసి స్థానిక పోలీసుల బందోబస్తు మద్య కూల్చివేతలు నిర్వహించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు పాల్పడితే ఎంతటి వారైన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్ఛరించారు.