మహేశ్వరం:మహేశ్వరంలోనే డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తామని రాష్ట్రవిద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే డిగ్రీకాలేజీ ఏర్పాటు చేయాలని శుక్రవారం టీఆర్ ఎస్ పార్టీ మండల అద్యక్షులు హనుమగల్లచంద్రయ్య ఆద్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి స్పందిస్తూ ప్రస్తుతం ఈవిద్యాసంవత్సరం వృథా కావద్దనే ఉద్దేశ్యంతో ఇక్కడ నడుపుతున్నామని అన్నారు.
బడంగ్పేటలో ఏర్పాటు చేస్తున్న డిగ్రీకాలేజీ ప్రస్తుతం తాత్కాలికంగానే ఉంటుందని ఆమె అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలోనే స్థలాన్ని చూసి ఇక్కడే డిగ్రీకాలేజీ ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడుతామని ఆమె అన్నారు. ప్రజలందరికి అందుబాటులో ఉండేవిదంగా అన్ని వసతులతో మండలకేంద్రంలోనే డిగ్రీకాలేజీ ఏర్పాటుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతామని ఆమె అన్నారు.
ఈకార్యక్రమంలో సహకారబ్యాంక్ చైర్మన్ మంచెపాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మండల కోఆప్షన్సభ్యులు సయ్యద్ ఆధిల్అలీ, జిల్లారైతుసమన్వయసమితి నాయకులు కూనయాదయ్య, తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ సర్పంచ్లు మెగావత్రాజునాయక్, మోతీలాల్నాయక్, ముక్కెర యాదయ్య మాజీ సర్పంచ్ ఆనందం నాయకులు కరోళ్లచంద్రయ్యముదిరాజ్, మద్దికరుణాకర్రెడ్డి,అంగోత్రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు