ముషీరాబాద్ : గాంధీనగర్ డివిజన్ సబర్మతీనగర్లో శ్రీ నల్లపోచమ్మ, ఎల్లమ దేవాలయ పునర్ నిర్మాణ పనులను సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే లాంచనంగా నిర్మాణ పనులను ప్రారంభించారు.
దాదాపు 50 లక్షల అంచనా వ్యయంతో, దాతల సహాయంతో ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు నిర్వాహకులు జీ.నర్సింగ్రావు, కె.నర్సింగ్రావు, రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎంఎన్.శ్రీనివాసరావు, ముఠా జయసింహ, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ యాదవ్, గురం శంకర్, చంద్రకళ, అభిషేక్ కెనడి తదితరులు పాల్గొన్నారు.