మాదాపూర్ : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్నారని చెవెళ్ళ ఎంపీ, డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీతో పాటు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్, నార్నె శ్రీనివాస్, పూజితగౌడ్, మంజుల రఘునాథ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో పాటు పార్టీ సభ్యులతో కలిసి పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాధీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం అభివృద్ధి ఆగకూడదనే లక్ష్యంతో పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు కల్యాణ లక్ష్మీ, షాధీ ముబారక్ వంటి పథకాలతో అర్హులైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు రాకుండా ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తు పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒకరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు డిప్యూటీ తాసీల్దార్ శంకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ సలీం, మాజీ కౌన్స్లన్ లక్ష్మీ నారాయణ, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాజు యాదవ్, రఘునాథ్రెడ్డి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.