బండ్లగూడ : అన్ని వర్గాల ప్రజలు సుఖఃసంతోషలతో పండుగలను జరుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పండుగల వేళ నిరు పేదలకు కానుకలను పంపిణి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వర్డ్స్ యాక్షన్ మినిస్ట్రిస్ హూరేబు చర్చి,వై యమ్సీఏ వారికి ఎంపైర్ ఫంక్షన్ హల్లో క్రిస్మస్ సంబురాలలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడు తూ పండుగల వేళ నిరు పేదలు అందరూ తమ ఇండ్లల్లో పండుగలను జరుపుకునేల కేసీఆర్ తెలంగాణలో పండుగలకు కానుకలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఇలాంటివి అనేక సంక్షేమ పథకాలను చేపట్టి వాటిని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణలో పండుగలకు ప్రత్యేక గుర్తుంపు టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలోనే వచ్చిందన్నారు.అంతకు ముందు ఆయన క్రిస్మమస్ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షాలు తెలిపారు.
ఎమ్మెల్సీ రాజేశ్వర రావు మాట్లాడుతూ కైస్తవుల కోసం క్రిస్మస్ సంబరాలను అధికారికంగా జరుపుకోనుటకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు దన్యవాదాలు తెలిపారు.ఈకార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ విజయభూషణం, స్వర్ణకుమార్, జాన్ బైరోస్, కురియస్థామస్, పరమేశ్వర పాల్, ఇన్స్పెక్టర్ కనకయ్య, మాలాకీ రత్నం, రవిందర్ తదితరులు పాల్గొన్నారు.