శేరిలింగంపల్లి : శాంతి భద్రతల పరిరక్షణలో సీసీటీవీ కెమెరాలు ఎంతో కీలకమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల ఉమా సపీయర్ హైట్స్ అపార్టుమెంట్స్లో గురువారం ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల అవగాహాన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమా సపీయర్ హైట్స్ అపార్టుమెంట్ వాసులు సీసీటీవీల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. సీసీటీవీల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహాన పెంపొందిస్తూ కాలనీవాసులను చైతన్యం చేయడం జరుగుతుందని అన్నారు.
ఒక సీసీటీవీ 100 మంది పోలీసులతో సమానమని అందరూ సీసీటీవీలు ఏర్పాటుచేసుకొని శాంతి భద్రతల పరిరక్షణలో తమవంతు భాగస్వామ్యన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ఇన్స్ఫెక్టర్లు అహ్మద్పాషా, రంజిత్కుమార్లు, నలగండ్ల హుడా కాలనీ అధ్యక్షుడు మంత్రిప్రగడ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకురాలు రామేశ్వరమ్మ, అపార్టుమెంట్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనిల్, కార్యదర్శి రాము తదితరులు పాల్గొన్నారు.