‘కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మెడలు వంచైనా మనం అనుకున్నది సాధిం చుకోవాలె. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచింది.’ అని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, గడప గడపకూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. అదే సమయంలో బీజేపీ వైఫల్యాల ను కూడా తెలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ఇతర రాష్ర్టాల్లో కూడా అందించేందుకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆదివాసులకు పోడు భూములపై హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది ఆత్మీయ సమ్మేళనం జరగ్గా.. జిల్లా ఇన్చార్జి గంగాధర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొని మాట్లాడారు.
ఆదిలాబాద్ టౌన్, ఏప్రిల్ 3 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, మెడలు వంచైనా అనుకున్నది సాధించుకోవాలని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలిలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతో మహిళల నుంచి సెగ తప్పదని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదన్నారు. మహారాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను అందించడానికే కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించినట్లు వెల్లడించారు. అన్ని సంఘాలు, అన్ని కులాలు వారి ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసేలా ఆత్మగౌరవ భవనాలను నిర్మించారని గుర్తు చేశారు. త్వరలో ఆదివాసులకు పోడు హక్కు పత్రాలను సీఎం కేసీఆర్ అందించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ ఎంపీ నగేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర విజయలక్ష్మిరాజు, ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు ప్రహ్లాద్ పాల్గొన్నారు.