కందుకూరు: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో గురువారం ఘనంగా బోనాలను నిర్వహించారు. సర్పంచ్ పల్లె వసంత క్రిష్ణగౌడ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బోనాలను అట్టహసంగా నిర్వహించారు. ఉదయం మహిళలు ఇండ్లను మామిడితోరణాలు, వేపకొమ్మలు, బంతిపూలతో అలంకరించారు. అందంగా అలంకరించిన వీధులతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మట్టి కుండలో నైవైద్యం ఉంచి బోనాన్ని తయారు చేసుకున్నారు. సాయంత్రం మహిళలు బోనాన్ని నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, యువకులు కేరింతలతో దేవాలయానికి బయలు దేరారు. అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించారు. ఎంతో అట్టహసంగా జరిగిన బోనాల ఉత్పవాల్లో సర్పంచ్ పల్లె వసంత క్రిష్ణగౌడ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు,గ్రామస్తులు పాల్గొన్నారు.