షేక్పేట్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ప్రభుత్వ పథకాలతో ప్రజలకులబ్ధి చేకూరుతుందని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు.
బుధవారం షేక్పేట్ డివిజన్లో లబ్దిదారులకు షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్లను ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్ కుమార్తో కలిసి అందచేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ నాయకులు షకీల్ హైమద్, సజ్జాద్ హుస్సేన్, మధుసూదన్,స్సేన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.