చిక్కడపల్లి :కరోనా సంక్షోభం వల్ల లక్షలాదిమంది బాలలు చదువులకు దూరమవుతున్నారని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెర్చేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాక్షన్ ఎయిడ్, ఎం.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పిల్లలపై కొవిడ్ ప్రభావం అనే అశం పై రౌండ్టేబుల్ సమావేశంను నిర్వహించారు. ఈసందర్భగా ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు అర్ధం కావడం లేదని వారు ఇష్టంగా చదువ లేక పోతున్నారని తెలిపారు.
పాఠశాలలు తెరవక పోవడం వల్ల పిల్లలు వారి స్నేహితులను దూరం అవుతున్నారని తెలిపారు. ఆన్లైన్ బోధన ద్వారా అభ్యాసన జరగడం లేదని విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, ప్రైవేట్ విద్యా వ్యవస్థపై నియంత్రణ లేని కారణంగా ఫీజులభారంతో బడులు మానేస్తున్నారని వివరించారు. లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో, యాక్షన్ఎయిడ్ రిజీనల్ మేనేజర్ ఎం.ఆంజనేయులు, ఎస్ఆర్డీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అనురాధ, సత్యవతి,డేవిడ్రాజ్,నాగరాజు, శంకర్, తదిత రులు పాల్గొన్నారు.