మహబూబ్నగర్, డిసెంబర్ 2 :స్వరాష్ట్రం వచ్చాక రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచి త విద్యుత్, రైతుబంధు పథకంతో ఉమ్మడి జిల్లాలో వ్య వసాయం పండుగలా సాగుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాదైతే ఏకంగా 16 లక్షల ఎ కరాల్లో రైతులు పంటలు పండించారు. పాలమూరు జిల్లా ధాన్యాగారంగా మారింది. వరి, పత్తి, వేరుశనగ, ఇ తర పంటలు చేశారు. వ్యవసాయానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాల వల్లే ఇదంతా సాధ్యమైందని అగ్రికల్చర్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.
పాలమూరు జిల్లాను విభజించాక ఏర్పడిన కొత్త ఐ దు జిల్లాల్లో నాలుగు జిల్లాలకు మెడికల్ కళాశాలను ప్ర భుత్వం మంజూరు చేసింది. నాలుగేండ్ల కిందట మహబూబ్నగర్కు మంజూరైన మెడికల్ కాలేజీ ఒక్కటే ఉం డేది. కొత్తగా వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేటకు కేటాయించారు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఇటీవలే సీఎం కేసీఆర్ ఆన్లైన్లో తరగతులను ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి మంజూరైన మె డికల్ కాలేజీ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గద్వా ల, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు ప్రభుత్వం న ర్సింగ్ కాలేజీలను మంజూరు చేసింది. అన్ని చోట్ల క్లా సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది గురుకుల పాఠశాలలో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని వి ధంగా రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నా యి. రహదారుల విస్తరణ, పచ్చదనం, మినీట్యాంక్ బండ్తో పట్టణాలు కళకళలాడుతున్నాయి. హరితహా రం కింద జాతీయ రహదారులు, రహదారులు, మండ ల రహదారులు పచ్చదనాన్ని పర్చుకున్నాయి. పట్టణ, పల్లెప్రగతి కింద అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి జిల్లాకూ సమీకృత కలెక్టరేట్లు మంజూరు చేశారు. వనపర్తిలో కొత్త కలెక్టరేట్ను ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహబూబ్నగర్లో కలెక్టరేట్ పూర్తికాగా, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో పనులు తుదిదశకు చేరాయి. నారాయణపేట జిల్లాల్లో త్వరలో సీఎం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పాలమూరు జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో జిల్లా కేంద్రంలో ఉండేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం కేసీఆర్ను ఒప్పించి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టా రు. ఎక్కడా లేని విధంగా జిల్లా కేంద్రంలో 3 వేల డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు కేటాయించారు. పెద్దచెరువును మినీట్యాంక్ బండ్గా మార్చారు. రూ. 300 కోట్లతో కొత్త సూపర్ స్పెషాలిటీ దవాఖానను ని ర్మించనున్నారు. జాతీయ రహదారికి పాలమూరు రో డ్డును అనుసంధానించి నాలుగులేన్ల రహదారిగా మా ర్చారు. క్లాక్టవర్ రూపురేఖలే మారిపోయాయి.