దిలావర్పూర్, మే 13 : కేంద్ర ప్రభుత్వ వద్ద న్నా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని తమ ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న దని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ పర్యావ రణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొ న్నా రు. మండలంలోని సిర్గాపూర్లో దేవాదాయ శాఖ నిధులు రూ. 10 లక్షలతో పునర్నిర్మించిన మహా లక్ష్మి ఆలయాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభిం చారు. అంతకు ముందు గ్రామస్తులు ఆలయ పండితులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగ తం పలికారు. అనంతరం ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ. 10 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ రైతులకు ఏం చేసింద ని ప్రశ్నించారు.
ఇప్పుడు రైతు డిక్లరేషన్ పేరుతో మరోసారి మోసం చేసేందుకు కొత్త నాయకుడు వస్తున్నాడని, అలాంటి వారి మాటలు నమ్మవద్ద ని సూచించారు. తెలంగాణ సంక్షేమ పథకాలను కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమ లు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజల ను మోసం చేసేందుకు ఆ రెండు పార్టీలు ఉన్నా యన్నారు. నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచు కొని 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, యువకులు కష్టపడి ఉద్యోగం సాధించాలని సూచించారు.
త్వరలోనే అర్హులైన 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్యాకేజీ 27 ద్వారా నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరా ల బీడు భూములకు సాగు నీరు అందిస్తా మన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గంగా రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము ల దేవేందర్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, కదిలి ఆలయ చైర్మన్ భుజంగ్ రావు, పాల్దె అనిల్, సాయన్న మాజీ సర్పంచ్ సాయారెడ్డి ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ ఖాన్, పశువైద్యాధికారి నందకుమార్, టీఆర్ఎస్ నాయకులు అనిల్, శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మంత్రి బందోబస్తుకు సిర్గాపూర్కు వచ్చిన నర్సాపూర్(జీ)ఎస్ఐ గీతతో చిన్నారులు కాసేపు ముచ్చటిం చారు. మేడం మేం మీ మాదిరిగా ఎస్ఐ కావాలంటే ఏం చదువుకోవాలి.. అని అడిగారు. చిన్నప్పటి నుంచి ఓ లక్ష్యంతో చదువుకుంటే ఉద్యోగం సాధించవచ్చని ఎస్ఐ వివరించారు.
– దిలావర్పూర్, మే 13