బోథ్(నేరడిగొండ)మే 4 : సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బోథ్ మండలం పట్నాపూర్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తో కలిసి రైతువేదికను ప్రారంభించారు. అనంతరం, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ముందుగా గ్రామస్తులు డోలు, వాయిద్యాలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణలోని గ్రామాలు, పల్లెలు, తండాల పరిస్థితి దారుణంగా ఉండేదని గుర్తు చేశారు. కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పల్లెలు, తండాల రూపురేఖలు మారాయన్నారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఇప్పటికీ 24 గంటల కరంట్ ఉచితంగా అందిస్తున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. గుజరాత్లో కూడా కరంట్ ఉచితంగా ఇవ్వడం లేదన్నారు. మిషన్కాకతీయతో ఎండకాలంలో కూడా చెరువుల్లో నీరు పుష్కలంగా ఉందన్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ పంద్రం సుగుణ, ఎంపీపీ తుల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, మండల కన్వీనర్ రుక్మాణ్సింగ్, ఆత్మచైర్మన్ మల్లెపూల సుభాశ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్ సలాం, రైతు బంధు సమితి అధ్యక్షుడు నల్ల జగన్మోహన్రెడ్డి, ఎంపీటీసీ డీ నారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, మే 4 : నిర్మల్లో మోడల్ లైబ్రరీని ఏర్పాటు చేసినట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జిల్లా గ్రంథాలయ శాఖ భవనంలో అదనపు గదుల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రంలో ఈ గ్రంథాలయం ఏర్పాటుతో పాఠకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని తెలిపారు. విజ్ఞానాన్ని అందించేది గ్రంథాలయాలేనని చెప్పారు.
లైబ్రరీల నిర్వహణకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సహిస్తున్నదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తున్న నేపథ్యంలో గ్రంథాలయాల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన విజ్ఞాన సమాచారాన్ని అందించే పుస్తకాలను అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
మంత్రి అల్లోల సహకారంతో నిర్మల్ గ్రంథాలయం దినదినాభివృద్ధి చెందుతున్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎసీఎస్ చైర్మన్ ధర్మాజి రాజేందర్, మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి లక్ష్మీరాజం, గ్రంథాలయ ఉద్యోగులు సంజీవ్రెడ్డి, రాజు, టీఆర్ఎస్ నాయకులు నేల అనిల్, పప్పి, తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి తరహాలో అడెల్లి పోచమ్మ ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అడెల్లి పోచమ్మ ఆలయాన్ని బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అడెల్లి పోచమ్మ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పునర్నిర్మించనున్నట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ. 11 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో గర్భగుడి, అర్ధమం డపం, విమాన గోపురాల నిర్మాణానికి రూ. 3 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
పునర్నిర్మాణ పనూలు జూన్ మూడో వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలోగా టెండర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగానే, అడెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఆలయ నిర్మాణంతోపాటు కృష్ణ శిలలను ఉపయోగించి అమ్మవారి ఆలయాన్ని సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించనున్నట్లు ఆయన వెల్లడిం చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడెల్లి పోచమ్మ ఆలయం అత్యంత ఆకర్షనీయంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లా వెంకటరాంరెడ్డి, మార్కెట్కమిటీ చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయకమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, నాయకులు రాజ్మహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, దేవి శంకర్, నాగయ్య, మురళీ కృష్ణ, సుచరిత పాల్గొన్నారు.