చిక్కడపల్లి :వ్యాక్సిన్ ప్రత్యేక డ్రైవ్లో గడిచిన మూడు రోజుల్లోనే 90వేల మందికి మొదటి, రెండోవ డోస్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గాంధీనగర్ డివిజన్ వివేక్నగర్ కాలనీలోని వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా గురువారం మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ ఏ.పావని వినయ్కుమార్తో కలిసి సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాక్సిన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతోందని వివరించారు.
స్పేషల్ డ్రైవ్లో భాగంగా మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో 1300 కాలనీలో 90 వేల మందికి వ్యాక్సినేషన్ వేశామని తెలిపారు. 950 కాలనీలు 100 శాతం వాక్సిన్ ప్రిక్రియ పూర్తి చేయడం జరిగింది తెలిపారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో అన్ని బస్తీ,కాలనీల్లో 100శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ -15 డీఎంసీ హరికృష్ణ, ఎఎమ్హెచ్ఓ హేమలత, ఈఈ సన్నీ, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.