మణికొండ : 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడలా ఘనంగా నిర్వహించారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఆనందా పోయిట్రీ అపార్టుమెంటులో చేవెళ్ల పార్లమెంటు సభ్యులు గడ్డం రంజిత్రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై అపార్టుమెంటువాసులతో కలిసి జెండావందన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అపార్టుమెంటు సంక్షేమ సంఘ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడాపోటీలల్లో విజేతలకు ఎంపీ రంజిత్రెడ్డి బమతులను అందజేశారు. అనంతరం ఆటాపాటలతో చిన్నారులు కార్యక్రమాన్ని అలరించారు.ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు నీలేష్ప్రసాద్దూబే,నాయకులు ప్రమోద్రెడ్డి, అపార్టుమెంటు వాసులు పాల్గొన్నారు.
మణికొండ, నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను మున్సిపల్ చైర్మన్లు కస్తూరి నరేందర్, దారుగుపల్లి రేఖలతో పాటు నార్సింగి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ యం.గంగాధర్, ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారులు శ్రీనివాస్, సాల్మాన్రాజు, మార్కెట్ కమిటీలో చైర్మన్ వెంకటేష్, ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. యువజన, కుల సంఘాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు.
అనంతరం దేశ స్వాత్రంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సుష్మారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి తన్వీరాజు, ఆయా గ్రామాల్లో సర్పంచ్లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను జరుపుకున్నారు. అదేవిధంగా పాఠశాలలు సెలవులు ఉండటంతో కొన్ని పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజేంద్రనగర్ జీహెచ్యంసీ కార్యాలయంలో ఉప కమీషనర్, ఆయా వార్డులో కార్పొరేటర్లు జెండాను ఎగురవేసి గౌరవ వందన చేశారు. కరోనా కారణంగా దేశ స్వాత్రంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన అమరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని శంషాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సుష్మారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి తన్వీరాజు, ఆయా గ్రామాల్లో సర్పంచ్లు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను జరుపుకున్నారు. అదేవిధంగా పాఠశాలలు సెలవులు ఉండటంతో కొన్ని పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజేంద్రనగర్ జీహెచ్యంసీ కార్యాలయంలో ఉప కమీషనర్, ఆయా వార్డులో కార్పొరేటర్లు జెండాను ఎగురవేసి గౌరవ వందన చేశారు. కరోనా కారణంగా స్వాతంత్య్ర వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాల్సి వచ్చిందని ప్రజాప్రతినిధులు, అధికారులు తెలిపారు.