బొడ్రాయిబజార్, ఏప్రిల్ 23 : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 26వ వార్డులో కౌన్సిలర్ నిమ్మల స్రవంతీశ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో 45సంవత్సరాలు నిండిన వారికి టీకాలు వేసి మాట్లాడారు. వ్యాక్సిన్పై అపోహలొద్దని ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు హర్షవర్ధన్, మురళీకృష్ణ, తెలంగాణ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు సుదర్శన్, మాజీ కౌన్సిలర్ నల్లపాటి అప్పారావు, కడారి అంజయ్య, రేపల్లె రాజా, కాసం రాము, తూడి నవీన్, వట్టె లింగరాజు, ఉపేందర్, సతీశ్, వెంకటేశ్, మధు, వీరస్వామి, కిశోర్, లతీఫ్ పాల్గొన్నారు.
312 మందికి వ్యాక్సిన్
అర్వపల్లి, ఏప్రిల్ 23 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు కోడూరులో ఏర్పాటు చేసిన క్యాంపులో శుక్రవారం 312 మందికి కరోనా టీకా వేసినట్లు అర్వపల్లి వైద్యాధికారి నవీన్కుమార్ తెలిపారు. కోడూరులో వ్యాక్సిన్ క్యాంపును ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు. వైద్యసిబ్బంది ప్రవీణ, నాగమణి, కుంభం వీరయ్య, రమణ, విజయశాంతి పాల్గొన్నారు.
నాగారంలో 50 మందికి..
నాగారం, ఏప్రిల్ 23 : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 50 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ గాదరి రామకృష్ణ తెలిపారు.
తాటిపాములలో వైద్యశిబిరం ప్రారంభం
తిరుమలగిరి, ఏప్రిల్ 23 : మండలంలోని తాటిపాముల గ్రామంలో శుక్రవారం కరోనా వ్యాక్సిన్ వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి ప్రశాంత్బాబు మాట్లాడుతూ ప్రజలంతా అపోహలు వీడి కరోనా టీకా వేసుకోవాలన్నారు. సీహెచ్ఓ బిచ్చునాయక్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్లో 40 మందికి
ఆత్మకూర్.ఎస్, ఏప్రిల్ 23 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 40 మందికి కరోనా టీకా వేశారు. సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ రంగమ్మ, శాంతికుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.