కరోనా బాధిత పోలీసు సిబ్బందికి సీపీ తరుణ్జోషి భరోసా
సుబేదారి, మే27: ‘కరోనా పాజిటివ్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. అండగా మేము న్నాం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి కొవిడ్ బాధిత పోలీసు సిబ్బందికి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన హోం ఐసొలేషన్లో ఉన్న పోలీసు సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైరస్ సోకిందని ఆందోళన చెందొద్దని, సరైన మందులు, పౌష్టికాహారం తీసుకుంటే వెంటనే తగ్గిపోతుందన్నారు. ప్రతిరోజూ ప్రాణాయామంతో పాటు తగి న జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా ఇంట్లో ఉండేందుకు అవకాశం లేకపోతే కమిషనరేట్ ఆధ్వర్యంలో వరంగల్, కాజీపేటలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో చేరాలని సీపీ సూచించారు. ఈ కేంద్రాల్లో కావాల్సిన ఏర్పాట్లు చేశారన్నారు. ఇప్పటి వరకు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిలో 400 మంది వైరస్ బారిన పడ్డారని, వారిలో 140 మంది ఐసొలేషన్ కేంద్రాల్లో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్కుమార్ కొవిడ్ బాధిత పోలీసు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఈస్ట్జోన్, సెంట్రల్జోన్ డీసీపీలు వెంటకలక్ష్మి, పుష్ప, స్పెషల్బ్రాంచ్ ఏసీపీ కిశోర్కుమార్, సీఐలు బాలాజీవరప్రసాద్, నరేశ్కుమార్ పాల్గొన్నారు.