సేవకు రూపం..ఆపదలో ఉన్నవారికి అభయం
లాక్డౌన్తో చిక్కుకుపోయిన ప్రజలకు సాయం
సొంతవాహనాల్లో ఇంటికి చేరవేత
జమ్మికుంట/ జ్యోతినగర్/ ఫర్టిలైజర్సిటీ, మే 25: నెత్తిన టోపీ.. చేతిలో లాఠీతో కఠినంగా కనిపించే పోలీసుల్లో కరిగిపోయే మనసూ ఉన్నది. కన్నీటి గాథలను చూసి చలించిపోయే తత్వమూన్నది. ఆ సేవా గుణమే ఇవ్వాళ లాక్డౌన్లో చిక్కుకుపోయి ఇండ్లకు చేరలేనివారికి దారిచూపుతున్నది. కొద్దిరోజులుగా ప్రయాణానికి వాహనాలు లేక రోడ్లపై ఉండే వారిని తమ సొంత వాహనాల్లో వారి గ్రామాలకు చేర్చుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. మంగళవారం సైతం ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీసులు స్పందించి సాయం చేసి సెల్యూట్ పోలీస్ అని పించుకున్నారు.
సొంత వాహనాల్లో గమ్యస్థానాలకు..
ఎన్టీపీసీ కాజిపల్లికి చెందిన కంది కనకవ్వ అనే వృద్ధురాలు ఎఫ్సీఐ క్రాస్ రోడ్డులో ఒంటరిగా నడవలేక అవస్థలు పడుతున్నది. బీపీ మందుల కోసం వచ్చి లాక్డౌన్తో రోడ్డుపైనే ఉండిపోగా, రామగుండం సీఐ కణతాల లక్ష్మీనారాయణ గుర్తించి పోలీస్ వాహనంలో ఇంటికి తరలించా డు. గోదావరిఖని గాంధీ చౌరస్తాలో ఇద్దరు మహిళలు ఓ పది నెలల పాపతో రోడ్డుపై ఉండగా, ఏసీ పీ ఉమెందర్ గమనించి వివరాలు తెలుసుకున్నా రు. పోతనకాలనీ అని గోదావరిఖనిలో ప్రైవేట్ దవాఖానలో చెకప్ కోసం వచ్చి ఇక్కడే చిక్కుకుపోయామని చెప్పగా, వెంటనే వన్ టౌన్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ సమాచారం ఇచ్చి పోలీస్ వాహ నం తెప్పించారు. ఏసీపీ దగ్గరుండి మరీ ఇంటికి పంపించారు. హుజూరాబాద్ మండలం రాజపల్లికి చెందిన లచ్చమ్మ మంగళవారం ఉదయం జమ్మికుంటకు వచ్చింది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసింది. సరుకులతో మండుటెండల్లో వెళ్తున్న వృద్ధురాలిని బ్లూకోల్ట్స్ సిబ్బంది నయీం పాషా, ఏ శ్రీనివాస్ చేరదీశారు. వివరాలు తెలుసుకొని ఆటో ట్రాలీలో ఇంటికి పంపించారు.