సుల్తానాబాద్ దవాఖానలో ఏర్పాట్లు
కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి జంక్షన్, మే18: కరోనా బారిన పడిన గర్భిణుల చికిత్సకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణుల డెలివరీ కోసం సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి, మంథని, గోదావరిఖని దవాఖానల్లో ఐసొలేషన్ ఉండే వారి కోసం ప్రత్యే క సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభు త్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఇక్కడ డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూ పరింటెండెంట్ మందల వాసుదేవారెడ్డి, సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్, తహసీల్దార్ పాల్సింగ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, వైద్యాధికారి స్రవంతి, సంబంధిత అధికారులు తదితరులున్నారు.