ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి,ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలి
ప్రతి విద్యాసంస్థల్లో వాటిని ఏర్పాటు చేయాలి
కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 13 : గ్రామాల్లో ఆరుబయట చెత్త వేయకుండా ప్రతి ఇంటి నుంచి సేకరించి డం పింగ్ యార్డుకు తరలించాలని, వాటి ద్వారా కంపోస్ట్ ఎరు వు తయారు చేసి విక్రయించడంతో ఆదాయం సమకూర్చుకోవాలని కలెక్టర్ హరిచందన అధికారులకు సూచించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలతో వోడీఎఫ్ ప్లస్ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు బహిరంగ మలమూత్ర విసర్జన కు వెళ్లకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నీటిని రో డ్డుపై వదలకుండా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని పే ర్కొన్నారు. ఇంకుడుగుంతల నిర్మాణాలకు స్థలం లేని వారికి కమ్యూనిటీ ఇంకుడుగుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇంత వరకు మరుగుదొడ్లు, ఇంకుడుగుంత లు కట్టుకొని వారిని గుర్తించి నిర్మాణాలు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాను ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించామని, అందులో భాగంగా వోడీఎఫ్ ప్లస్ను అమలు చేయాల ని ఆమె చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని, ప్రతి విద్యాసంస్థలో బాలికలకు, బా లురకు మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన క ల్పించాలని, ఏ ఒక్కరూ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతిరోజు గ్రా మా ల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో 100శాతం వోడీఎఫ్ ప్రకటించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వారం రో జుల్లో పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్ట ర్ చంద్రారెడ్డి, డీఆర్డీవో గోపాల్నాయక్, పీఆర్ ఈఈ నరేందర్, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.