నిర్దేశించిన సమయానికే పనులన్నీ పూర్తి కావాలి
రోడ్డు విస్తరణ పనుల పరిశీలనలో మంత్రి అజయ్
రఘునాథపాలెం, జూన్ 10: అభివృద్ధి పనుల నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రఘునాథపాలెం మండలం కోయచలక క్రాస్ రోడ్డు నుంచి పాపటపల్లి వరకు జరిగే రోడ్డు విస్తరణ పనులను గురువారం ఆయన పర్యవేక్షించారు. జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయానికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పుష్పలత, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, విద్యుత్ ఎస్ఈ రమేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జడ్పీటీసీ ప్రియాంక, వైస్ ఎంపీపీ గుత్తా రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, సర్పంచ్లు మాదంశెట్టి హరిప్రసాద్, కొర్లపాటి రామారావు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణతో గ్రామాలకు కొత్తందం
గ్రామాల్లోని ప్రధాన రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులతో పల్లెలకు కొత్తందాలు సంతరించుకుంటున్నాయని మంత్రి అజయ్ అన్నారు. సుడా నిధులు రూ.2 కోట్లతో వీ వెంకటాయపాలెంలో, మరో రూ.2 కోట్లతో మంచుకొండలో చేపట్టిన రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులను కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి మంత్రి అజయ్ గురువారం పర్యవేక్షించారు. మంచుకొండ సొసైటీ చైర్మన్ మందడపు సుధాకర్, ఆత్మ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్గౌడ్, సర్పంచ్ వాంకుడోతు విజయ, ఏఎంసీ డైరెక్టర్ రాఘవేందర్, ఉప సర్పంచ్ తేజావత్ రమేశ్ పాల్గొన్నారు.