ఇంద్రవెల్లి, జూన్7: జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేసిన కంది విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూర్ డివిజన్ ఇన్చార్జి ఏడీఏ రాథోడ్ గణేశ్ అన్నారు. మండలంలోని ఇంద్రవెల్లి రైతు వేదికలో సోమవారం ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత చేతుల మీదుగా రైతులకు ఉచిత కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలో కొంతమంది రైతులను ఎంపిక చేసి ఉచిత కంది విత్తనాలు అందిస్తున్నట్లు తెలిపారు. వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్సింగ్, ఇంద్రవెల్లి మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, ఏఈవో రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తాంసి, జూన్ 7: జిల్లాలో పప్పుదినుసుల సాగును ప్రో త్సహించేందుకు అర్హులైన రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఏఈవో యోగిరాజ్ అన్నారు. మం డలంలోని పొన్నారిలో రైతులకు ఉచితంగా కంది విత్తనాలు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎన్ఎఫ్ఎస్ఎం పథకంలో భాగంగా ఈ విత్తనా లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు వీటిని సాగు చేసి లాభాలు పొందాలన్నారు. ఎంపీటీసీ ముచ్చ రేఖర ఘు, సర్పంచ్ సంజీవ్రెడ్డి, ఉప సర్పంచ్ అశోక్, పీఏసీఎస్ డైరెక్టర్ చంద్రన్న, మాజీ ఎంపీటీసీలు రమణ, విలాస్, నా యకులు రాంరెడ్డి, శ్రీవర్ధన్, మహిళా రైతులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 7: మండలంలోని కుమారి గ్రామం లో వందశాతం సబ్సిడీపై కంది విత్తనాలను సర్పంచ్ రాజుయాదవ్ సోమవారం రైతులకు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కంది విత్తనాలు వేసే రైతులకు వ్య వసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. అవసరమైన రైతులు కంది విత్తనాల ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేశ్, ఏఈవో వసుధ, రైతులు ప్రవీణ్,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.