వనపర్తి రూరల్, ఏప్రిల్ 23 : రైతుల సంక్షేమం కోసమే పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కిచ్చారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగవరం, రాజపేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి ఆయా గ్రామ సర్పంచులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేవరకు ధాన్యం కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని, రైతులు సకాలంలో నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాన్ని తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోకుండా కేంద్ర నిర్వాహకులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి, రాజనగరం, నాగవరం సహకార సంఘాల చైర్మన్లు వెంకట్రావు, విజయ్కుమార్, మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషన్ర్ మహేశ్వర్రెడ్డి, సర్పంచ్ జ్యోతి, గొర్రెల కాపరుల సంఘం కన్వీనర్ కురుమూర్తియాదవ్, రఘువర్ధన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, మాధవ్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షులు, సహకార, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
శ్రీరంగాపూర్లో..
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 23 : మండలంలోని తాటిపాముల గ్రామంలో శుక్రవారం సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో అధ్యక్షుడు జగన్నాథం నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, రైతుబంధు మండల అధ్యక్షులు గౌడ్ నాయక్, సర్పంచు సత్యం యాదవ్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, ఎంపీటీసీ ఎల్లస్వామి, పాల్గొన్నారు.
వీపనగండ్లలో..
వీపనగండ్ల, ఏప్రిల్ 23 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకోవాలని రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య అన్నారు. మండలంలోని పుల్గర్చర్ల, రంగవరం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వర్, ఏపీఎం చంద్రకళ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ జయప్రద, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరేశ్, టీఆర్ఎస్ నాయకులు రఘునాథ్ రెడ్డి, నారాయణ రెడ్డి, బాల్చంద్రి, యాదన్న, మల్లయ్య పాల్గొన్నారు.
రాణిపేటలో ..
కొత్తకోట, ఏప్రిల్ 23 : మండలంలోని రాణిపేట గ్రామంలో కొత్తకోట సింగిల్విండో ఆధ్వర్యంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో డైరెక్టర్ బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ధాన్యం 16 శాతం తేమ ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ డైరెక్టర్ రాజు, నాయకులు పాండురంగయ్య, సంపత్రెడ్డి, నాగన్న, చంద్రయ్య, వెంకటస్వామి, లాలు, భాస్కర్, రామకృష్ణ పాల్గొన్నారు.
పెద్దమందడిలో..
పెద్దమందడి, ఏప్రిల్ 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎంపీపీ తూడి మెగారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బలిజపల్లి, జంగమాయిపల్లి, వీరాయపల్లి, మంగంపల్లి, వెల్టుర్, వీవర్స్ కాలనీ, చిలకటోనిపల్లి, మద్దిగట్ల, అల్వాల్, చిన్నమందడి, దొడగుంటపల్లి, మనిగిల్ల గ్రామాల్లో మహిళా సమైఖ్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో కూడా వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అన్నారు. వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గ్రామాల్లోనే మహిళా సంఘాలు, సింగిల్విండోల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, అందుకు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని తాము ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ మన్యపురెడ్డి, సర్పంచులు సతీశ్, భాగ్యమ్మ, శ్రీనివాస్రెడ్డి, సువర్ణమ్మ, ఎంపీటీసీలు , ఆయా గ్రామాల రైతుబంధు కో-ఆర్డినేటర్లు, మహిళా సంఘాల సభ్యులు, ఏపీఎం రాజశేఖర్రెడ్డి, వ్యవసాయ అధికారి మల్లయ్య, ఆయా క్లస్టర్ల ఎంఈవోలు తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఏపీలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ.. వ్యాక్సిన్ ఫ్రీ
చెట్టంత దేవుడికి చెట్టు తొర్రే ఆలయం.. మన తెలంగాణలోనే