నారాయణపేట, ఏప్రిల్ 5 : కరో నా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కన్నా జగదీశ్, టీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు కోట్ల రాజవర్ధన్రెడ్డి అ న్నారు. పట్టణంలోని జిల్లా దవాఖాన లో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సోమవారం టీకా తీసుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రతాప్రెడ్డి, వినోద్, హన్మంత్రెడ్డి, వెంకటేశ్, బసప్ప, నా రాయణ, వెంకట్రెడ్డి, దేవన్నచారి, సాయప్ప టీ కా తీసుకున్న వారిలో ఉన్నారు.
కరోనా నియంత్రణపై ప్రభుత్వం చర్యలు
కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని జిల్లా పరిషత్ చై ర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. చైర్పర్సన్ దంపతులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ టీకా తీసుకునేందుకు ముందుకు రావాలన్నారు. టీకా విషయంలో ఎలాంటి అపోహలను నమ్మరాదని, ఈ విషయంపై ప్రజాప్రతినిధులు గ్రామా ల్లో విస్త్రృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ప్ర తిఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
63 మందికి…
నర్వ, ఏప్రిల్ 5 : మండలంలోని ప్రభుత్వ ద వాఖానలో 45 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ టీ కా వేస్తున్నట్లు డాక్టర్ ఫాతిమా తెలిపారు. పలు గ్రామల నుంచి వచ్చిన 63 మందికి టీకాలు వేసినట్లు ఆమె చెప్పారు. టీకాను తీసుకునేందుకు ప్ర జలు ముందుకు రావాలన్నారు.
60 మందికి…
కృష్ణ, ఏప్రిల్ 5 : కృష్ణ, మాగనూర్ మండలాల్లోని మాగనూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీమంత్ 60 మందికి టీకా వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీమంత్ మాట్లాడుతూ కొవి డ్ వ్యాక్సిన్ సురక్షితమైందని, ఎలాంటి అనుమానాలు, భయాలు లేకుండా టీకా వేసుకోవాలన్నా రు. మనమందరం కలిసికట్టుగా పోరాడి కరోనాపై విజయం సాధించేందుకు కృషి చేద్దామన్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.